ములుగు : వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్తున్న భక్తుల(Devotees ) ఆటో బోల్తా(Auto overturns) పడటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మూడు చింతల వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడారం( Medaram )దైవ దర్శనానికి వెళ్తున్న క్రమంలో ఆటో మూడు చింతల వద్దకు రాగానే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను మేడారం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.