రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువ జాము నుంచే దర్శనం కోసం క్యూ లైన్ లలో బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కోడెమొక్కు చెల్లించుకున్నారు.
కళాభావన్ లో భక్తులు కళ్యాణాల మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్నను 12.30 వరకు సుమారు 20 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
భారత్, రష్యా మధ్య పలు రక్షణరంగ ఒప్పందాలు
చరిత్రలో ఈరోజు : బాబ్రీ మసీదు కూల్చివేసి నేటికి 29 ఏండ్లు