Kondagattu | జగిత్యాల : జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీక్షాపరులు స్వామి వారి సన్నిధిలో దీక్షా విరమణ చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి సుమారు 50 వేల మంది దీక్షాపరులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 22వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. బుధవారం కూడా భారీ స్థాయిలో దీక్షాపరులు వచ్చి అంజన్నను దర్శించుకోనున్నారు.
కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం
హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ పుణ్యక్షేత్రం కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. pic.twitter.com/gXJNDpdoJI
— Telugu Scribe (@TeluguScribe) April 23, 2024