తాడ్వాయి(ములుగు జిల్లా), మార్చి18 : వనదేవతల దర్శనానికి వచ్చిన దశరధ్(60) అనే భక్తుడు గుండెపోటుతో మృతిచెందిన సంఘటన శుక్రవారం ములుగు జిల్లా మేడారంలో చోటుసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్లోని ఓల్డ్ సిటీకి చెందిన దశరధ్.. 25 మందితో కలిసి మూడు రోజుల క్రితం మేడారం వచ్చారు. మేడారం పంచాయతీ పరిధిలోని రెడ్డిగూడెంలో గుర్రాల రాజిరెడ్డికి చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
శుక్రవారం అమ్మవార్లను దర్శించుకుని ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో దశరధ్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్ రూమ్కి వెళ్లగా గుండెపోటు రావడంతో కింద పడి మృతిచెందాడు. గమనించిన తోటి భక్తులు అతడిని దవాఖానకు తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు.