హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ పాలనలో దేశాభివృద్ధి పదేండ్లు వెనక్కి పోయిందని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నేతలు విమర్శించారు.
యువతకు విద్య, ఉపాధి హక్కుల సాధన కోసం శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర మాట్లాడుతూ.. గతంలో 3.7 ఉన్న నిరుద్యోగ శాతం మోదీ పాలనలో 13.2కి పెరిగిందని దుయ్యబట్టారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలు మానేసి, కార్పొరేట్ శక్తుల ఆస్తులను జాతీయం చేయాలని డిమాండ్ చేశారు.