PM Modi | ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నిజామాబాద్కు వస్తున్నారు. ఆయన హెలికాప్టర్ నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్పై ల్యాండ్ కానున్నది. దాన్ని కట్టించింది కేసీఆర్ ప్రభుత్వం. దిగి తలెత్తి చూడగానే సువిశాల ప్రాంగణంలో కలెక్టరేట్ సముదాయం కనిపిస్తుంది. దాన్ని కట్టించిందీ కేసీఆర్ ప్రభుత్వం. దాని పక్కనే హైటెక్ హంగులతో నిర్మించిన ఐటీ టవర్ కనిపిస్తుంది. దాన్ని కట్టించిందీ కేసీఆర్ సర్కారే.
నాలుగు అడుగులు ముందుకేస్తే న్యాక్ భవనం కూడా కనువిందు చేస్తుంది. ఆ భవనాన్ని కట్టించిందీ కేసీఆర్ సర్కారే. కొంచెం ఓపికపడితే మోదీకి పచ్చటి హరితహారం కూడా కనిపించేదే.. కానీ, ఆయన వస్తున్నారని చెట్లను నరికేశారు. కొంచెం దూరంలో బైపాస్ అబ్బురపరుస్తుంది. ఇదీ కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధే.
ఇవన్నీ ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నికలు వస్తున్నాయి కదా అని పసుపు బోర్డు పెట్టడం కాదు..
అభివృద్ధి అంటే ఇలా ఉంటుందని ప్రధాని తెలుసుకుంటే మంచిదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
నిజామాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన అభివృద్ధి అడుగడుగునా స్వాగతం పలుకనున్నది. ప్రధా ని హెలికాప్టర్ దిగబోయే ప్రాంతం నుంచి సభాప్రాంగణం వరకు కేసీఆర్ చేసిన అభివృద్ధి సాక్షాత్కరించనున్నది. సమీకృత కలెక్టరేట్, ఐటీ టవర్, న్యాక్ బిల్డింగ్, మందారమాలగా రూపుదిద్దుకున్న బైపాస్ రోడ్డు, రూ.4 కోట్లతో నిర్మితమైన ఆధునిక వైకుంఠధామం వంటివన్నీ మోదీ వస్తున్న ప్రాంతానికి కేవలం 100 చదరపు మీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ప్రధాని ఎక్కడికెళ్లినా అక్కడి గుడిసెలు, మురికివాడలు కనిపించకుండా వస్ర్తాలతో మూసివేస్తుంటారు. తెలంగాణలో ఆ పరిస్థితులు లేవు. కేసీఆర్ పాలనలో సుందరంగా ముస్తాబైన నగరమే సాక్షీభూతంగా నిలుస్తున్నది. కేసీఆర్ చేసి చూపించిన అభివృద్ధిని పరదాలతో మూసివేసే అవకాశం లేకపోవడం బీజేపీకి ఇబ్బందిగా మారింది.
ప్రధాని మోదీ మంగళవారం ఆకాశమార్గాన నిజామాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఎస్పీజీ అధికారుల వివరాల మేరకు బీదర్ నుంచి ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్లో వచ్చి.. సమీకృత కలెక్టరేట్ మైదానంలో దిగుతారు. సువిశాలమైన ఈ ప్రాంతం ఆకాశ మార్గంలో అద్భుతంగా కనిపిస్తుంది. మియావాకీ పద్ధతిలో ఏపుగా పెరిగిన వన సంపద వద్దన్నా ఆకర్షిస్తుంది. ఆకాశమార్గాన వచ్చే మోదీకి తప్పకుండా కనిపిస్తుంది. సమీకృత కలెక్టరేట్కు ఆనుకొని, మెట్రో సిటీలకు పరిమితమైన ఐటీ టవర్ సైతం మోదీకి ఘనంగా స్వాగతం పలుకనుంది. రూ.50 కోట్లతో నిర్మించిన ఈ ఐటీ టవర్ ముందునుంచే మోదీ కాన్వాయ్ గిరిరాజ్ కళాశాల మైదానానికి వెళ్లాలి. ఆ పక్కనే రూ.11కోట్లతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సైతం మోదీని ఆకట్టుకోవడం ఖాయం.
తెలంగాణలో ఏమి జరిగిందని ప్రశ్నించేవారికి, సీఎం కేసీఆర్ ఏం చేశారో చెప్పడానికి ఇవన్నీ మోదీ కండ్లకు కాకతాళీయంగా దర్శనమివ్వబోయే అభివృద్ధి నమూనాలు. గతుకులు లేని అద్భుతమైన బైపాస్ రోడ్డు, మధ్యలో డివైడర్పై పచ్చదనం వరుస, ఆ పక్కనే హరితహారం మొక్కలన్నీ తెలంగాణ గడ్డ గొప్పతనాన్ని ప్రధానికి తెలియజేయనున్నాయి. కేంద్ర సర్కారు సహాయ, సహకారాలు లేకపోయినప్పటికీ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధికి నమూనాగా నిలిచిన తెలంగాణ ఘనతను చాటిచెప్పబోతున్నాయి. ప్రధా ని సభల కవరేజీలో మీడియాపై ఆంక్షలు వి ధించారు. కెమెరాలకు పర్మిషన్ లేదంటూ మె సేజ్లు వచ్చాయి.