సూర్యాపేట : బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కుడ , కోమటి కుంటకు చెందిన వంద మంది యువకులు కాంగ్రెస్ , బీజేపీలకు రాజీనామా చేసి మంత్రి సమక్షం లో బీఆర్ఎస్(BRS) లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత గా బలోపేతం చేయడానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభ పరిణామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ సర్కారు తెలంగాణ అమలు చేస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
గ్రామాలు , పట్టణాలలో ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. గతంతో పోలిస్తే గ్రామాలు , పట్టణాల్లో అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నదన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు గుర్రం సత్యనారాయణ రెడ్డి , మాజీ కౌన్సిలర్ సైదులు, మాజీ మార్కెట్ డైరెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.