నిర్మల్ : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ ప్రధాన ఎజెండా. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణ సమీపంలోని గండి రామన్న శ్రీ సాయి బాబా ఆలయంలో రూ. 25 లక్షలతో చేపట్టిన ఆలయ ప్రహరీ గోడ, ఇతర అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. జిల్లా లోని ప్రధాన ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేవాలయాలకు వచ్చే భక్తుల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం గుడ్డి విమర్శిస్తున్నాయని తెలిపారు.
మేము గుడులు కట్టిస్తున్నామా? గుళ్లలోని లింగాలను మింగుతున్నామా? అన్నది ప్రజలకు తెలుసన్నారు. నోరును అదుపులో పెట్టుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం ఇకనైనా మానుకోండని సూచించారు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. మీ విమర్శలే దీవెనలుగా మరిన్ని మంచి కార్యక్రమాలు తీసుకొస్తూ నిర్మల్ నియోజకవర్గాన్ని, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూనే ఉంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
నారింజ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద