Harish Rao | సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సూఫీ మసీదు ఆవరణలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పండుగ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో అలై బలై తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీశ్ రావు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్ల నుంచి అందరూ అన్నదమ్ముళ్ల వలె పండుగలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల్లో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతున్నదని స్పష్టం చేశారు. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సూచించారు.