మహబూబ్నగర్ : దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి శనివారం సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
మహబూబ్నగర్ జాతీయ రహదారి నుంచి బలీదుపల్లి మీదుగా వర్నె, ముత్యాలంపల్లి, పేరూరు, వెంకంపల్లి వరకు ఉన్న రోడ్డును డబుల్ లైన్ చేస్తూ, రూ.16 కోట్లతో బీటీ రోడ్డు, వర్నె, ముత్యాలంపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరారు.
భూత్పురు నుంచి నాగర్కర్నూల్ వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు ఏవీఆర్ కాలనీ వరకు రోడ్డు గుంతలుగా మారిందని.. రెన్యువల్, బీటీ నిర్మించాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించి.. వెంటనే బడ్జెట్ కేటాయించి, నిధులు మంజూరు చేయాలని ఈఎన్సీ, సంబంధిత అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే వివరించారు.