ఖమ్మం, మార్చి 1 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పోరాటాల కోసమే సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్) ఆర్ఐ పార్టీలు కలిసి సీపీఐ (ఎంఎల్) మాస్లైన్గా ఏర్పడ్డాయని ఆ పార్టీ జాతీయ స్థాయి మహాసభల నిర్వహణ కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ (ఎంఎల్) రెవల్యూషనరీ కేంద్ర కమిటీ కార్యదర్శి ప్రదీప్సింగ్ ఠాగూర్, పీసీసీ సీపీఐ (ఎంఎల్) కేంద్ర కార్యదర్శి సుభాష్దేవ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో ఆది, సోమ, మంగళవారాల్లో మూడు రోజులపాటు పార్టీ జాతీయస్థాయి మహాసభలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.