చేర్యాల/సిద్దిపేట : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గురువారం రాత్రి దర్శించుకున్నారు. ఇటీవల ఆయన కూతురు వివాహం జరిగిన సందర్భంగా మల్లన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
కాగా డిప్యూటీ స్పీకర్కు ఆలయ ఈవో ఏ.బాలాజీ, అర్చకులు పూర్ణకుంభంతో ఎదురెగి స్వాగతం పలికారు. అనంతరం పద్మారావు అమ్మవార్లకు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.