భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): సోలార్ విద్యుత్తే ప్రత్యామ్నాయ మార్గమని, ఈ విద్యుత్తుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ నూతన విద్యుత్తు పాలసీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియాలోని రామవరంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు ప్లాంట్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
థర్మల్ పవర్ ప్లాంట్ల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. సింగరేణి యాజమాన్యం ఓపెన్కాస్టుల్లో ఓవర్ బర్డెన్ తీసిన తర్వాత అక్కడ సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, రాందాస్నాయక్, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, మట్టారాగమయి తదితరులు పాల్గొన్నారు.