హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు వెల్లివిరాయలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలన్నారు.
ప్రజలందరికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని చెప్పారు. అవినీతి రహిత, పారదర్శక పాలన అందజేస్తామన్నారు. తప్పకుండా ప్రజా పాలన అందిస్తామని తెలిపారు.