హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): భారత పార్లమెంట్నే రక్షించలేని వాళ్లు, దేశ ప్రజలను ఎలా రక్షిస్తారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పార్లమెంట్పై దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను ఆప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిలోభాగంగా శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్ ధర్నాచౌక్ వద్ద పీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పార్లమెంట్పై అగంతకులు దాడి చేస్తే, సభలో చర్చించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సభలో చర్చిద్దామని అడిగితే ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని ఆరోపించారు. దేశ రక్షణను ప్రధాని మోదీ గాలికి వదిలేశారని మండిపడ్డారు.
దేశ చరిత్రలో కనీవిని ఎరగని విధంగా 141 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడం దుర్మార్గమని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు, పార్లమెంట్ నుంచి బహిషరణలు.. స్వేచ్ఛ, భావ ప్రకటన లేకుండా నియంతృత్వ పోకడలతో మోదీ పాలన సాగుతుతున్నదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు దేశ సరిహద్దుల్లో చిన్నచిన్న ఘర్షణలు సృష్టించి దేశ ప్రజల్లో భావోద్వేగాన్ని రగిలించి మళ్లీ అధికారంలోకి రావాలనే యావే తప్ప, ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడలనే ఆలోచనే బీజేపీకి లేదని విమర్శించారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో దేశభక్తులు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, విప్ ఆది శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్, ఆప్ కన్వీనర్ సుధాకర్,కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, మల్లు రవి తదితరులు మాట్లాడారు.
ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేయాలి
ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ..బీజేపీ ఎంపీలు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని, వారికి దేశంపై గౌరవమే లేదని తెలిపారు. పార్లమెంట్పై దాడి సమగ్ర వివరాలు బయటికి రావాల్సిన అసవరం ఉన్నదని పేర్కొన్నారు. బాధ్యులకు పాస్లు జారీ చేసిన ఎంపీలపై చర్చ జరగకుండా, ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం నేత నంద్యాల నర్సింహారెడ్డి, న్యూడెమెక్రసీ నాయకుడు కే గోవర్దన్, ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.