హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్లను తరలించేందుకు చెల్లించే రవాణా చార్జీలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జిల్లాకు రూ. 2 లక్షల చొప్పున 33 జిల్లాలకు రూ.66 లక్షల నిధులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సోమవారం రిలీజ్ చేశారు.
నిధుల విడుదల పట్ల గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి రాజగంగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.