హైదరాబాద్ : ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరోసారి అనుమతించింది. ప్రస్తుతం 45 ఏండ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించింది.
ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే టీకా ఇవ్వాలని సూచించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రైవేట్ దవాఖానల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను తూ.చ. తప్పక పాటించాలని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు కోరారు.
ప్రైవేట్ దవాఖానకు టీకాల పంపిణీ నిలిపివేస్తూ గత శుక్రవారం (గత నెల 30న) వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటుకు వెంటనే టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలని డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు డీఎంహెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు.
అందుబాటులో ఉన్న డోసులను వినియోగించుకోవచ్చని, మిగిలిన టీకాలను వెంటనే సేకరించాలని సీసీపీ వైద్యాధికారులను డీహెచ్ ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.