జయశంకర్ భూపాలపల్లి, మే 28 (నమస్తే తెలంగాణ) : ‘శిలాఫలకాలు కూల్చడం కాంగ్రెస్ సంస్కృ తా? మా ఓపికకూ ఓ హద్దుంటుం ది. గులాబీ సైన్యానికి సహనం నశిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ ఆఫీస్లో అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మట్లాడారు. ఈ తెలివిని అధికార పార్టీ నాయకులు కొనుగోలులో చూపాలని హితవు పలికారు. భూపాలపల్లిలో బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ ఆవిష్కరించిన అభివృద్ధి పనుల పైలాన్ను అధికారపార్టీ కూల్చే ప్రయత్నం చేయడం హేయమని మండిపడ్డారు.