హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలనే డిమాండ్తో జూన్ 1 ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని(సీఎం ఇల్లు) ముట్టడించనున్నట్టు మాజీ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ప్రకటించారు. గన్పార్ అమరవీరుల స్థూ పం వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని గవర్నర్కు, అనేకసార్లు మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ప్రయోజనం లేకుండా పో యిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజావాణిలో 11 సార్లు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిషారం కానందున సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. బిల్లులు రావాల్సిన వారు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, నాయకులు వై అరవింద్రెడ్డి, ఆనబోయిన సుధాకర్, గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి, గంధం మల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి పాల్గొన్నారు.