ఏడాదిన్నరలోనే 35% పెరుగుదల
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఇంటర్నెట్ వినియోగం, ఆన్లైన్ లావాదేవీలతోపాటు సైబర్నేరాలు కూడా అధికమవుతున్న నేపథ్యంలో సైబర్ నిపుణులకు భారీ డిమాండ్ పెరుగుతున్నది. ఈ రంగంలో ఏడాదిన్నర కాలంలోనే 35 శాతం మేర డిమాండ్ పెరిగినట్టు ఎంప్లాయిమెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ కంపెనీ- టీంలీసీ సర్వీసెస్ వెల్లడించింది. ప్రస్తుతం 25 వేల మంది సైబర్ నిపుణుల అవసరం ఉన్నట్టు అంచనా వేసింది. సైబర్ దాడులు, మోసాల నుంచి తమ కస్టమర్లను కాపాడుకొనేందుకు పలు కంపెనీలు సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకొనేందుకు ఆసక్తి చూపుతుండటమే భారీ డిమాండ్కు కారణమని పేర్కొంది. ఈ-కామర్స్ సంస్థల్లో భారీ డిమాండ్ ఉన్నట్టు తెలిపింది. కొన్ని సంస్థలు నేరుగా సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమిస్తుండగా, మరికొన్ని సంస్థలు కన్సల్టెన్సీలకు ఔట్సోర్సింగ్ ఇస్తున్నట్టు తెలిపింది. ఫ్రాడ్ డిటెక్షన్, ప్రివెన్షన్, ఆడిట్, ఫోరెన్సిక్ ఎనాలసిస్ విభాగాల నిపుణులకు మంచి అవకాశాలున్నాయని టీం లీసీ సర్వీసెస్ బిజినెస్ హెడ్ నరీన్ భాగి పేర్కొన్నారు. ఫోరెన్సిక్ స్కిల్స్ ఉన్నవారికి అత్యంత ప్రాధాన్యమున్నదని, డొమైన్ నిపుణులకు డిమాండ్ పెరుగుతున్నదని అని సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఎండీ ప్రశాంత్ భట్ పేర్కొన్నారు. పేమెంట్ ఫ్లాట్ఫామ్లు సైతం సైబర్ సెక్యూరిటీ అంశాలపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఇండి యా కార్పొరేట్ ఫ్రాడ్ పర్సెప్షన్ సర్వే – 2020 డిసెంబర్ నివేదిక ప్రకారం వచ్చే రెండేండ్లలో సైబర్ నేరాలు మరింత పెరగనున్నాయి.
కార్పొరేట్ ఫ్రాడ్ పర్సెప్షన్ సర్వే ప్రకారం రానున్న రెండేండ్లలో ప్రధాన సైబర్నేరాల్లో పెరుగుదల అంచనా