రాంనగర్, డిసెంబర్ 21: కరీంనగర్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందింది. మానకొండూరు మండలం గంగిపల్లికి చెందిన సృజన(18) నగునూరు సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహంలో ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ నగరంలోని ఓ ప్రైవేట్ సూల్ బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు.
గురువారం ఉదయం 7గంటల ప్రాంతంలో హాస్టల్ ఉద్యోగిని స్వప్న ఫోన్ చేసి ‘మీ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు’ అని చెప్పిందని, కొద్దిసేపటికి పోలీసులు ఫోన్ చేసి ‘మీ కూతురు హాస్టల్లో ఉరేసుకొని చనిపోయింది’ అని సమాచారం ఇచ్చారని లక్ష్మీనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేరొన్నాడు. సమాచారం రాగానే కళాశాలకు వెళ్లగా రూమ్ నంబర్ 102లో ఫ్యాన్కు చున్నీ కట్టి ఉన్నదని, అప్పటికే మృతదేహాన్ని కిందికి దింపారని తెలిపాడు. తమ కుటుంబం లో ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు లేవని చెప్పాడు. హాస్టల్ టీచర్ మౌనిక, స్వప్న, ప్రిన్సిపాల్తోపాటు సృజన స్నేహితురాలైన జ్యోతి, సత్య సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వారిపై అనుమానం ఉన్నదని ఫిర్యాదులో పేరొన్నాడు.