పెద్దపల్లి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో మరో నిందితుడికి బెయిల్ లభించింది. జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల శివారులో జరిగిన హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
హత్య కేసులో నిందితుడిగా ఉన్న పెద్దపల్లి పట్టణానికి చెందిన అనిల్కు బెయిల్ లభించింది. 2021 ఫిబ్రవరి 17న జరిగిన ఈ హత్య కేసులో కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్క పాక కుమార్, బిట్టు శ్రీనివాస్, కాపు అనిల్, ఉదరి లచ్చయ్య, వెల్డి వసంతరావు లు నిందితులుగా ఉన్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారిస్తుండగా.. గత నెలలో ఆరవ నిందితుడిగా ఉన్న వసంతరావు కు బెయిల్ లభించింది. తాజాగా గురువారం 5వ నిందితుడిగా ఉన్న కాపు అనిల్కు బెయిల్ మంజూరు అయింది.