Yadadri Bhongir | యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో జింక మృతిచెందడం కలకలం రేపింది. గ్రామంలోని జిట్టు శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ భూమిలో శుక్రవారం ఉదయం జింక చనిపోయి ఉండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ పొలంలో జింక మృతదేహం కనిపించడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జింక సహజ మరణమా? ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చల్లూరు నుంచి బేగంపేట వెళ్లే రోడ్డులో ఈ వ్యవసాయ భూమి ఉండటంతో ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.