రంజాన్ మాసంలో సేవా కార్యక్రమాలు చేసేందుకు టీఆర్ఎస్ నాయకులు ముందుకు రావడం సంతోషకరమని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎంకె భద్రుద్దీన్ ఆధ్వర్యంలో మహిళలకు పండుగకు సరిపోయే నిత్యావసరాలను మంత్రి మహమూద్ అలీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. కరోనాను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఖాసీం, గౌస్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
టోలిచౌకిలో.. ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలను అందించడం ఎంతో సంతోషంగా ఉందని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొయినుద్దీన్ అన్నారు. శనివారం టోలిచౌకిలో ఆయన పేద ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.