హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3,603 కేసులు వెలుగుచూశాయి. శనివారంతో పోల్చితే ఇది దాదాపు 700 తక్కువ. రాష్ట్రంలో 93 వేలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కొవిడ్, ఇతర కారణాలతో ఒకరు మ రణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 32 వేలు దాటిం ది. రికవరీ రేటు 95.08 శాతానికి తగ్గింది. మరోవైపు 2,707 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. శనివారం అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,421, మేడ్చల్ మల్కాజిగిరిలో 308, రంగారెడ్డిలో 262, హనుమకొండలో 150 కేసులు వెలుగు చూశాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 2.10 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 36 వేల మందికి మొదటిడోస్ ఇచ్చారు.
ఆదివారం రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు