హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): పోలింగ్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనేలా.. వారిని ఆకర్షించేందుకు ఎన్నికల కమిషన్ వినూత్న రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆయా జిల్లా ల్లో పోలింగ్ కేంద్రాలను అలంకరించనున్నారు. కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్లను మహిళలు, వికలాంగులు, యువత నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఓ టింగ్ శాతం పెరుగుతుందని, విద్యావంతులు, ఉన్నత వర్గాల నుంచి ఓటింగ్ పట్ల సానుకూల స్పందన రాగలదని అంచనా వేస్తున్నారు.
ఓటింగ్కు దూరంగా ఉండే వారిని ఇలా ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. గతంలో మాదిరిగా రోటీన్గా కాకుండా భిన్న పద్ధతుల్లో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. 2018 ఎన్నికల్లో ఈ విధానాన్ని తక్కువ పోలింగ్ స్టేషన్లలో అమలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో ఇటువంటి పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మహిళలు, వికలాంగులు, యువత నిర్వహించే పోలింగ్ స్టేషన్లకు ఆ వ ర్గాల ఓటర్లే వచ్చే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా పట్టణ ప్రాంతాల్లో 14,458, గ్రామీణ ప్రాంతాల్లో 20,898 ఉన్నాయి.
పోలింగ్ రోజున అక్రమాలు, రిగ్గింగ్, దొంగ ఓట్లు, చనిపోయిన వారి పేరుతో వేసే ఓట్లను గుర్తించేందుకు వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, రాజకీయం గా ప్రాధాన్యమున్నవి, వివాదాస్పద ప్రాంతా లు, మత కల్లోలాకు అవకాశమున్నవి, ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాలు, అల్లర్లు జరిగే అవకాశాలున్న పోలింగ్ స్టేషన్లలో మొత్తంగా ఈ సారి 27,798 చోట్ల వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు.