హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): వేతన సవరణలో భాగంగా 40 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) కోరింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. పీఆర్సీ కమిటీ ఆహ్వానం మేరకు టీఆర్టీఎఫ్ ప్రతినిధి బృందం బుధవారం బీఆర్కేభవన్లో పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్తో సమావేశమైంది. సీపీఎస్ను రద్దుచేయాలని, అన్ని గ్రేడ్లకు వార్షిక వేతన పెంపు రేటును 3 శాతానికి తగ్గకుండా చూడాలని, రిటైర్మెంట్ గ్రాట్యుటీ 28 లక్షలుగా ఉండాలని కోరింది.
ఏఎస్వోలకు సూపరింటెండెంట్ పేస్కేల్ కల్పించండి: సచివాలయ ఉద్యోగులు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (ఏఎస్వో)కు సూపరింటెండెంట్ స్థాయి పేస్కేల్ను వర్తింపజేయాలని సచివాలయ ఉద్యోగులు పీఆర్సీ కమిటీని కోరారు. బుధవారం పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ను కలిసి పలు ప్రతిపాదనలు సమర్పించారు. సూపరింటెండెంట్లతో సమానంగా పనిచేస్తున్నా తమకు తక్కువ వేతనాలున్నాయని, సమాన పనికి సమాన వేతనాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తిచేశారు.