హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని ఖర్చుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, కావలి అశోక్కుమార్ కోరారు. ఉద్యోగుల ప్రయోజనాలైన పీఆర్సీ, డీఏ వంటి అంశాలను బడ్జెట్లో చేర్చకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా పీఆర్సీ ఫిట్మెంట్పై అసెంబ్లీలో విస్పష్ట ప్రకటన చేయాలని వారు కోరారు.