కుమ్రంభీం అసిఫాబద్ : పండుగపూట కుమ్రంభీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నదిలో స్నానికి వెళ్లి గల్లంతయిన యువకుల కథ విషాదంగా ముగిసింది. నలుగురు యువకులు నీట మునిగి చనిపోయారు(Death of four youths). జాలర్లు మృతదేహాలను వెలికి తీశారు.
వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కౌటాల మండలం నదిమాబాద్ గ్రామానికి చెందిన సంతోష్, ప్రవీణ్ సాయి, కమలాకర్ అనే నలుగురు యువకులు హోలీ(Holi ) ఆడిన అనంతరం కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్ధా నదిలో(Wardha river) స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు.
గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికి ఫలితం లేకపోయింది. నలుగురు నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను కౌటాల దవాఖానకు తరలించారు. పండుగ పూట ఒకే సారి నలుగురు స్నేహితులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.