శంకరపట్నం, మే 3: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. తోపుడుబండిపై పండ్లు విక్రయించి జీవనోపాధి పొందే ఆ దంపతుల కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ తల్లిండ్రులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. దీంతో వారు తోపుడు బండిలోనే కొడుకు మృతదేహాన్ని తరలించగా.. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కేశవపట్నం గ్రామానికి చెందిన ఎల్కపెల్లి వీరయ్య-రుక్కమ్మ గ్రామంలోని మెయిన్ రోడ్డుపై పండ్లు విక్రయించి జీవనోపాధి పొందేవారు.
వీరి కుమారుడు యాకూబ్(38) అనారోగ్యానికి గురయ్యాడు. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు కొడుకును మెయిన్ రోడ్డుపై ఉన్న తమ రేకుల షెడ్డుకు తీసుకువచ్చి 108 అంబులెన్స్కు కాల్ చేశారు. అంబులెన్స్ సి బ్బంది వచ్చిచూడగా అప్పటికే యా కూబ్ చనిపోవడంతో వారు తిరిగివెళ్లిపోయారు. వారు పండ్లు అమ్ముకునే తోపుడు బండిలోనే కొడుకు మృతదేహాన్ని తరలించగా, ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.