హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): అక్రమంగా ఔషధాలు (మెడిసిన్స్) నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డైరెక్టర్ జనరల్ కమలాసన్రెడ్డి హెచ్చరించారు. వారికి మందులు సరఫరా చేసిన డీలర్లపైనా చర్యలు ఉంటాయని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లెలో అరవింద్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లో అక్రమంగా నిల్వ చేసిన 59 రకాల ఔషధాలను తాజా సోదాల్లో గుర్తించినట్టు చెప్పారు.
ఇందు లో అత్యధిక ప్రభావం చూపే యాంటీబయాటిక్స్, టీబీ డ్రగ్స్, ఇతర మందులు ఉన్నాయని, వీటి విలువ రూ.1.02 లక్షలు ఉంటుందని తెలిపారు. అవసరం లేని వ్యక్తులు యాంటీబయాటిక్ డ్రగ్స్ వాడటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఔషధాలు నిల్వ చేయాలనుకొనేవారు కచ్చితంగా డీసీఏ నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు.