మంథని రూరల్, మే 11 : తల్లి లేని కూతురిని కంటి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే తాగుడుకు బానిసై సైకోగా మారి గొడ్డలితో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భట్టుపల్లికి చెందిన గుండ్ల సదయ్య గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లో పనులు చేసుకుంటున్న తన కూతురు గుండ్ల రజిత(10)ను వెనుక వైపు నుం చి గొడ్డలితో మెడపై, భుజాలపై నరికాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత గ్రామంలోని కిరాణ షాపు వద్దకు వెళ్లి షాపు నిర్వాహకుడు శ్రీనివాస్పై సైతం గొడ్డలితో దాడి చేయ గా అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడే ఉన్న శ్రీనివాస్ భార్య, గ్రామస్తులు సదయ్యను అడ్డుకుని గొడ్డలి లాక్కోవడంతో శ్రీనివాస్ ప్రాణా లు దక్కాయి. వెంటనే అతన్ని కరీంనగర్లోని ద వాఖానకు తరలించారు. కాగా, దాడి చేసిన తర్వాత సదయ్య మళ్లీ తన ఇంటికే వచ్చి రక్తపు మడుగులో ఉన్న కూతురు శవం పక్కనే కూర్చొని ఉన్నాడు.
గ్రామస్తులు ఇంటి బయట ఉన్న సద య్య కొడుకు అంజితో ‘మీ చెల్లి ఎక్కడ ఉంది?’ అని అడుగగా వెంటనే ఇంటికెళ్లి చూసే సరికి రజిత రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించింది. తన చెల్లిని అలా చూసి గుండెలు బాధుకుంటూ రోదిస్తూ బయటికి వచ్చి గ్రామస్తులకు చెప్పాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులంతా సదయ్య ఇంటికి వచ్చి రజిత మృతదేహాన్ని చూసి కన్నీంటి పర్యంతమవుతూ సదయ్యను చంపేయాలంటూ కోపోద్రిక్తులయ్యారు. అంజి తన చెల్లిని చంపిన తండ్రి సదయ్యను కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో సదయ్య అంజిని గడ్డపారతో పొడిచేందుకు వెళ్లడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.
పోలీసులు సద య్య ఇంటికి చేరుకొని వాహనంలో ఎక్కించుకొని వెళ్తుండగా గ్రామస్తులంతా అడ్డుకున్నారు. సదయ్యను తమకు అప్పగించాలని పోలీసు వాహనానికి చెట్లు, కర్రలను అడ్డుగా పెట్టారు. వాహనంపై దాడి చేసి అద్దాలను పగులగొట్టారు. పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పరిస్థితులు చెయ్యి దాటిపోతున్న నేపథ్యంలో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా, గోదావరిఖని నుంచి అదనపు బలగాలు భట్టుపల్లికి చేరుకొని అ దుపు చేసే ప్రయత్నం చేశాయి. సీఐ సతీశ్ గ్రామస్తులతో మాట్లాడగా, ఇలాంటి వ్యక్తి బతికి ఉండకూడదని, కఠినంగా శిక్షించాలని లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. సదయ్యను కఠినంగా శిక్షించే లా చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడం తో గ్రామస్తులు శాంతించారు. తర్వాత సదయ్య ను మంథని ఠాణాకు తరలించారు. రజిత మేన మామ సుమన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. కాగా, సదయ్య భార్య 9 నెలల కిందటే సదయ్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.