Telangana | యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అత్త మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన కోడలు హఠాన్మరం చెందింది. గుండెలు పగిలేలా రోదిస్తూ అత్త మృతదేహం వద్దనే కుప్పకూలింది.
వివరాల్లోకి వెళ్తే.. యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసెల గ్రామానికి చెందిన భారతమ్మ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందింది. అత్త మరణవార్త విని కోడలు మంగమ్మ గుండెలు పగిలేలా రోదించింది. పొద్దుట్నుంచి అత్త మృతదేహం వద్దనే విలపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఏడుస్తూ ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించి కుటుంబ సభ్యులు మంగమ్మను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఒకేసారి అత్తాకోడళ్లు మృతి చెందడం ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. వాళ్ల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.