రంగారెడ్డి : అత్తపై కోపంతో కోడలు(Daughter-in-law) కత్తితో దాడి చేసి గాయపర్చింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి(Rangareddy )జిల్లా శంషాబాద్ మండలం చౌదరిగూడ(Chaudhariguda)లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాలతో అత్త అనురాధపై కోడలు అంబిక కత్తితో దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన అనురాధను హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.