హైదరాబాద్: మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీకి పలువురు నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. కొన్ని రోజులుగా ముఖ్య నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. నిన్న భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడి.. టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో నేత బీజేపీకి గుడ్ బై చెప్పారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న దాసోజు శ్రవణ్ ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు లేఖ రాశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుస్సాకరంగా ఉందని మండిపడ్డారు. నోట్లు పంచి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానట్లు తెలిపారు.