Dasoju Sravan | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రైతు, పేదల వ్యతిరేక పార్టీ అని, దాని కర్కశ వైఖరి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే ఎన్నికల కమిషన్కు రాసిన లేఖతో స్పష్టమైందని బీఆర్ఎస్ సీనియర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. చిల్లర రాజకీయాల కోసం రైతుల జీవనోపాధిపై దెబ్బకొట్టడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ రైతులు వ్యవసాయాన్ని ఆపలేరని, రైతులను వేధించకూడదని హితవు పలికారు.
రై తుబంధు నిలిపివేయాలని ఈసీకి రా సిన లేఖను కాంగ్రెస్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, భవిష్యత్తును స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలిపెట్టకూడదని బుధవారం ట్విట్టర్లో సూచించారు. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో దూ రదృష్టితో ప్రారంభించిన రైతుబంధు కార్యక్రమం రైతులకు అత్యంత అవసరమని, దేశవ్యాప్తంగా స్ఫూర్తినిస్తున్నదని గుర్తుచేశారు.