Minister KTR | గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ ప్రతిపాదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ కేబినెట్ నిర్ణయాలను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలు లో తిరిగి తీర్మానం చేసి పంపుతాం. రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎస్టీల నుంచి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్లను గవర్నర్కు ప్రతిపాదిస్తూ క్యాబినెట్ తీర్మానించింది. వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టుకు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపాలని నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్కు మరో ఎయిర్పోర్టు అవసరం ఉంది. హైదరాబాద్లో హాకింపేట ఎయిర్పోర్ట్ను గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరొక 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు కు క్యాబినెట్ నిర్ణయం. రైతులు, హైదరాబాద్, వరంగల్ అభివృద్ధిపై క్యాబినెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నది. వర్షాలు, వరదలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పంటనష్టంపై పూర్తి నివేదిక అందాక నిర్ణయం. కేంద్రం కూడా రాజకీయం చేసుడు బంద్ చేసి, సహాయం చేయాలని కేబినెట్ సూచించింది. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది’ అని కేటీఆర్ వివరించారు.