సంగారెడ్డి : ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి పోలియోను నివారించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarasimha) అన్నారు. ఆదివారం జోగిపేట వంద పడకల ప్రభుత్వ దవాఖానలో పల్స్ పోలియో(Polio vaccines) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రసూతి వార్డులో పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. పోలియో రహిత సమాజం కోసం కలిసికట్టుగా పోరాడుదామన్నారు. అనంతరం జోగిపేట ఏరియా దవాఖానలో ఎమర్జెన్సీ సౌకర్యం కోసం నూతన అంబులెన్స్ను అందజేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గాయత్రి దేవి ఆర్డీఓ పాండు, సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.