హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): భారీ ఆనకట్టలను నిర్మించడంపైనే కాకుండా పురాతన, చారిత్రక ఆనకట్టల భద్రతపై కూడా ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని డ్యామ్ సేఫ్టీ విభాగం నిపుణుడు శ్రీనివాస్ కోరారు.
ఆనకట్టల భద్రతపై బెంగళూరులో కేంద్ర జల్శక్తి శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. డ్యామ్లను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని, వాటి భద్రతను విస్మరిస్తే వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని స్పష్టం చేశారు. సదస్సులో కేంద్ర జల్శక్తి శాఖ అధికారులు, అంతర్జాతీయ నిపుణులు పాల్గొన్నారు.