హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో దకన్ సిమెంట్స్ లిమిటెడ్ సంస్థ రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించిందన్న ఆరోపణలపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) తన విచారణను ముమ్మరం చేసింది. ఈ ఆక్రమణల ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని తెలంగాణ అటవీ శాఖను ఆదేశించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన పసుపులేటి సురేశ్బాబు అనే సామాజిక కార్యకర్త 2025 డిసెంబర్ 6న కేంద్ర సాధికార కమిటీకి ఫిర్యాదు చేశారు.
దకన్ సిమెంట్స్ సంస్థ రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించిందని తన ఫిర్యాదులో పేరొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈసీ 2025 డిసెంబర్ 22న తెలంగాణ రాష్ట్ర అటవీ దళాల అధిపతికి లేఖ రాసింది. ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.