జమ్మికుంట: దళితబంధుపై వదంతులను కాకుండా వాస్తవాలను నమ్మాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్ణణంలోని 4,5,6,7,10 వ వార్డుల్లో దళిత వాడలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించి, లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పకొట్టాలని, అందుకు యువత ముందుండాలని సూచించారు. దళితబంధును ఆపేందుకు కుట్రలు చేస్తూనే, గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితులందరికీ లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.