హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. దళిత బంధు ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా దళితబంధుకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రత్యేక చట్టం తేవాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఈ పథకంలో భాగంగా దళితులకు ప్రభుత్వం రూ.10 లక్షల సాయం అందజేయనుంది. లబ్దిదారులు కలిసి పెద్ద యూనిట్ను పెట్టుకునే అవకాశం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది.