బాన్సువాడ, అక్టోబర్ 17 : తామంతా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే నడుస్తామని.. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్కు చెందిన దళితులు మద్దతు ప్రకటించారు. దాదాపు 300 దళిత కుటుంబాల సభ్యులు మంగళవారం సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేశారు.
బాన్సువాడ పట్టణంలో స్పీకర్ను కలిసి ఏకగ్రీవ తీర్మాన కాపీని అందజేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతోపాటు సంక్షేమ పథకాలను గడపగడపకూ అందజేస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డిని తిరిగి గెలిపించుకుంటామని వారు ప్రకటించారు. తనకు మద్దతు తెలిపిన బైరాపూర్ దళిత కుటుంబాలకు స్పీకర్ పోచారం ధన్యవాదాలు తెలిపారు.