ఖైరతాబాద్, జూలై 20: దళితుల సాధికారితకు అహర్నిషలు కృషిచేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పేర్కొన్నారు. దళితులు ఆయనను జీవితాంతం దైవంలా కొలుస్తారని, ఆయన వెంటే ఉంటారని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత వాడల్లో ఇంటింటికీ వెళ్లి ఈ పథకం గురించి ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. ఎంహెచ్పీఎస్, మహా ఎమ్మార్పీఎస్, టీఎంఎస్ఎస్, మాల మహానాడు, ప్రజా సంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల సమాఖ్య, తెలంగాణ దళిత దండు, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ జేఏసీ, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్టులో మంగళవారం తెలంగాణ దళితబంధు పథకంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ.. దళితబంధు తేవడం ద్వారా సీఎం కేసీఆర్ ఆ జాతులకు ఆత్మబంధువయ్యారని పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం తదితరులు పాల్గొన్నారు.