హుజురాబాద్ :మూడెకరాల భూమి పొందిన దళిత కుటుంబం తమ ఇంట్లో కేసీఆర్ చిత్రపటాన్ని దేవుడిగా భావించి పూజలు చేస్తున్నది. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం రవీందర్-రాజమణి కుటుంబ సభ్యులు కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితులకు మూడెకరాల భూమి పథకం ద్వారా లబ్ది పొందడంతో వారు కేసీఆర్ నే దైవంగా భావిస్తూ వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి చిత్రపటాలతోపాటు కేసీఆర్ చిత్రపటాన్ని ఉంచి ప్రతీ రోజు పూజలు చేస్తున్నారు.
తమకు మూడెకలరాల భూమి ఇచ్చిన కేసీఆర్ తమకు దైవంతో సమానమని కోడెంరవీందర్-రాజమణి దంపతులు అంటున్నారు. మూడెకరాల భూమి ఇవ్వడంతో వ్యవసాయం చేసుకుంటూ ఆర్థకంగా నిలదొక్కుకున్నామని వారు చెబుతున్నారు.