హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని పల్లెలన్నీ శాలపల్లి వైపు కదులుతున్నాయి. దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి దళితులందరూ భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో దళితులు ఆర్టీసీ బస్సుల్లో బయల్దేరుతున్నారు. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో పల్లెలన్నీ మార్మోగిపోతున్నాయి. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఏర్పడింది.