బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో దళితబంధు పారిశ్రామికవేత్తలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సన్మానించారు. దళిత బంధుతో దళితుల దశ మారిందని మంత్రి పేర్కొన్నారు. అధికారుల చిత్తశుద్ధితో ఈ పథకం విజయవంత మైందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మేయర్ సునీల్రావు తదితరులు పాల్గొన్నారు.
– కరీంనగర్ కలెక్టరేట్