మషీరాబాద్, ఫిబ్రవరి 20: దళితులను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పంతో కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని యథావిధిగా అమలుచేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మం గళవారం విద్యానగర్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మాదిగ మహిళా సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ప్రభుత్వం పట్టింపులకు వెళ్లకుండా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కోరారు. ఎన్నికల ముందు ఎం పిక చేసినవారికి దళితబంధు మంజూరు చే యాలని డిమాండ్ చే శారు. అధిక జనాభా కలిగిన మాదిగలకు రాజకీయంగా ఎక్కువ అవకాశాలు కల్పించాలని, మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీ ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.