హైదరాబాద్: దళిత బంధు అద్భుతమైన పథకమని నిఖిల్ కుమారస్వామి గౌడ తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఆ సమావేశానికి వచ్చిన జేడీ నేత నిఖిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కేసీఆర్ విజన్ బాగుందని ఆయన మెచ్చుకున్నారు. తన విజన్తో తెలంగాణను అభివృద్ధి పథంలో కేసీఆర్ నడిపారని, అలాంటి విజన్ను ఇప్పుడు దేశవ్యాప్తం చేయాలని నిఖిల్ అన్నారు. గడిచిన 8 ఏళ్లలో తెలంగాణలో అభివృద్ధి వేగంగా సాగిందన్నారు. దళిత బంధు పథకం అమేజింగ్గా ఉందని నిఖిల్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దళితుల్ని పట్టించుకోలేదన్నారు. రైతుల కోసం కేసీఆర్ అందిస్తున్న రైతు బంధు పథకం కూడా అద్భుతంగా ఉందని నిఖిల్ అన్నారు.