కరీంనగర్ : సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రకటించి హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేయటంపట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హుజూరాబాద్లో జరిగిన సంబురాల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో దళితులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఇల్లందకుంటలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ అధ్యక్షురాలు విజయ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటాని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాలాభిషేకం చేశారు. అలాగే దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించినందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయం సాహోసొపేతమైందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, దళిత సంఘాల నాయకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
షాకింగ్ : స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో అశ్లీల చిత్రాలు